కోలీవుడ్ లో ఇప్పటి వరకు 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలు రాలేదు.అయితే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వస్తుంది.
అదే పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను తమిళ్ బాహుబలి అంటూ అక్కడి మీడియా ప్రచారం చేస్తుంది.
ఈ సినిమా బాహుబలి రేంజ్ లో ఉంటుంది అని రెండు పార్టులు కలిసి బాహుబలి కలెక్షన్స్ ను బీట్ చేస్తుంది అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కొద్దిగా అంచనాలు అయితే ఏర్పడ్డాయి.
ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు.
ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమాను ఎప్పటి నుండో తెరకెక్కించాలి అని అనుకున్న ఇప్పటికి అది సాధ్యం అయ్యింది.ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రే, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాపై హైప్ ఏర్పడడంతో అందరు ఎలా ఉండబోతుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా ఈ నెల 30న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు.
పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా చాలా గ్రాండ్ గా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.మరి ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అంటే.చాలా స్లోగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది.మరి రిలీజ్ తర్వాత మౌత్ టాక్ బాగుంటేనే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టగలదు.
ఏ మాత్రం అటు ఇటు అయినా ఈ సినిమా భారీ నష్టాలను చవి చూడక తప్పదు.