బీజేపీ ఎమ్మెల్యే కారుపై నిరసనకారుల దాడి..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే కారు పై దాడి జరిగింది.

భూదాన నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ ప్రయాణిస్తున్న వాహనం పై నిరసనకారులు దాడి చేశారు.

ముజఫర్ నగర్ లోని సిసౌలి లో ఈ ఘటన చోటు చేసుకుంది.జన కళ్యాణ్ కార్యక్రమానికి హాజరైన బిజెపి ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్ ప్రయాణిస్తున్న కారు పై నిరసనకారులు తీవ్రస్థాయిలో దాడులు చేయడం జరిగింది.

రాళ్లతో కారు అద్దాలు ధ్వంసం చేశారు.ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న సమయంలో నిరసన కారులను పోలీసులు అదుపు చేయలేక పోవడంతో.

ఒక్కసారిగా నిరసనకారులు రెచ్చిపోవడంతో ఎమ్మెల్యే కారు పై దాడి జరిగింది.కొద్ది క్షణాల్లోనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో పోలీసు భద్రత మధ్య అక్కడి నుండి ఎమ్మెల్యే కారు వెళ్ళిపోయింది.

Advertisement

త్వరలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో బిజెపి ఎమ్మెల్యే కారుపై దాడి జరగడం ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు