కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండిస్తూ పులివెందులలో ఆయన అనుచరులు నిరసన ర్యాలీ నిర్వహించారు.నల్ల రిబ్బన్లు ధరించి వైఎస్ఆర్ సర్కిల్ నుంచి పూల అంగళ్ల వరకు ర్యాలీని చేపట్టారు.
వైఎస్ భాస్కర్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేశారని, సీబీఐ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఇక్కడ ఉన్న ప్రజలను అడిగితే వాస్తవాలు తెలుస్తాయని భాస్కర్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు.







