దేశంలో భారీ బ్యాంకు కుంభకోణాలలో పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్( Punjab National Bank ) కొన్నేళ్ల క్రితం బాగా చర్చల్లో ఉండేది.రూ.13500ల కోట్ల కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ( Mehul Choksi ) దేశం విడిచి పారిపోయాడు.ఆంటిగ్వా( Antigua ) పారిపోయిన అతడిని పక్క ప్రాంతమైన డొమినికాలో పోలీసులకు చిక్కాడు.
దీంతో అతడు అరెస్ట్ తర్వాత భారత్కు అతడిని తరలించడం తథ్యమని అంతా భావించారు.తాజాగా అతడికి ఆంటిగ్వా కోర్టులో భారీ ఊరట దక్కింది.ఆంటిగ్వా బార్బుడా కోర్టులలో మెహుల్ చోక్సీకి భారీ ఊరట దక్కింది.
తనను 23 మే 2021 న అతన్ని ఆంటిగ్వా, బార్బుడా నుండి కిడ్నాప్ చేశారని, డొమినికాలో తనను చిత్రహింసలు పెట్టినట్లు చోక్సీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ విషయంలో ఆంటిగ్వా అటార్నీ జనరల్, పోలీసు చీఫ్ చేత సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని కోర్టును కోరాడు.దీనిపై అక్కడి హైకోర్టు స్పందించింది.చోక్సీ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని తాజాగా ఆదేశించింది.

కోర్టు తన తీర్పులో మెహుల్ చోక్సీని కోర్టు ఉత్తర్వులు లేకుండా ఆంటిగ్వా, బార్బుడా సరిహద్దు నుండి బయటకు పంపొద్దని స్పష్టం చేసింది.చోక్సీని అతడి అభీష్టానికి వ్యతిరేకంగా డొమినికా నుండి బహ్ల్కు బలవంతంగా తీసుకెళ్లారా అని కోర్టు ప్రశ్నించింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ.13,500 కోట్ల మోసానికి సంబంధించి మెహుల్ చోక్సీ ప్రధాన నిందితుడు.

అతడు తన అరెస్టును ముందే ఊహించి ఆంటిగ్వాకు పారిపోయాడు.అతడిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు సీబీఐ తన ప్రకటనలో తెలిపింది.ఆర్థిక నేరస్థులను భారతదేశానికి రప్పించి, ఇక్కడి కోర్టుల్లో హాజరు పర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల ప్రత్యేక చొరవతో గత 15 నెలల్లో 30 మందికి పైగా ఆర్థిక నేరస్థులు అరెస్టు అయి, భారతదేశానికి తిరిగి వచ్చారు.







