ఇటీవల ఒక కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు( Kotasrinivas Rao ) పవన్ కళ్యాణ్ ని( Pawan Kalyan ) ఉద్దేశించి రెమ్యూనరేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ లాంటి హీరోలు కూడా రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు అని తెలిపారు.
కోట శ్రీనివాసరావు కావాలనే పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవ్వడంతో పవన్ అభిమానులు సైతం మండిపడుతున్నారు.ఆయన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడితే ఆయనకేంటి సమస్య అంటూ కోట అని విమర్శిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా నిర్మాత నట్టికుమార్( Nattikumar ) సైతం కోటని ఈ విషయమై నిలదీసారు.ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ.వయస్సు అయ్యిపోయిన కోట శ్రీనివాసరావుకు ఎందుకు, ఏం అవసరం?పవన్ కళ్యాణ్ నిజాయితీగా ,నీతిగా నేను టాక్స్ కడుతున్నాను.నేను టాక్స్ పేయర్ ని, నేను ఇంత తీసుకుంటున్నా, నేను ఇంత తీసుకుంటున్నా కూడా ప్రజల కోసం అవన్నీ వదులుకుని వస్తున్నాను.బ్రతుకుతున్నాను.నాకు ఓటేయండి.నేను మీ కోసం కష్టపడతాను.మీ కోసం శ్రమిస్తాను అంటున్నారు.
అందులో తప్పేముంది.ఆయన టాక్స్ కడుతున్నాడు కాబట్టి చెప్పారు.
కోట టాక్స్ ఎగ్గొడుతున్నాడు కాబట్టి చెప్తున్నారా కోట మూడు షిప్ట్ లు, నాలుగు షిప్ట్ లు కూడా చేసిన రోజులు ఉన్నాయి.ఒకరి మీద ఆయన పడకూడదు…కోటకు మైక్ ఇచ్చారు.వాగేయటం మొదలెట్టేసారు.ముసలాయన, ఏజ్ అయ్యిపోయింది.కాబట్టి ఆయన హద్దులో ఆయన ఉంటే బెటర్ అంటూ మండి పడ్డారు.ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.