మరోసారి తెరపై కనిపించబోతున్న బ్లాక్ బస్టర్‌ నిర్మాత బండ్ల

టాలీవుడ్‌ బ్లాక్ బస్టర్‌ నిర్మాతగా పేరు దక్కించుకున్న బండ్ల గణేష్‌ అనూహ్యంగా నిర్మాణంకు దూరం అయ్యాడు.

నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారిన తర్వాత సినిమాల్లో నటించడం మానేశాడు.

నటుడిగా ఆయన చేసిన సినిమాలు చాలా వరకు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆయన పాత్రలకు మంచి గుర్తింపు అయితే దక్కించుకున్నాడు.నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి నవ్వించిన బండ్ల గణేష్‌ నిర్మాతగా ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్న నేపథ్యంలో మళ్లీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో రైలు ఎపిసోడ్‌ లో కనిపించాడు.

ఆ సినిమాలో బండ్ల గణేష్‌ పాత్ర ఆహా ఓహో అన్నట్లుగా ప్రచారం జరిగింది.కాని దర్శకుడు అనీల్‌ రావిపూడి నిడివి ఎక్కువ అవ్వడం వల్ల కట్‌ చేయడం జరిగిందట.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించడం తన సన్నివేశాలను కట్‌ చేయడం పట్ల అప్పట్లో బండ్ల గణేష్‌ చాలా ఫీల్‌ అయ్యాడు.మళ్లీ సినిమాల్లో నటించను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మళ్లీ మారుతి దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో బండ్ల గణేష్‌ ను నటింపజేస్తున్నారట.దర్శకుడు మారుతి పట్టు బట్టి మరీ ఆయనకు సూట్ అయ్యే ఒక పాత్ర కోసం ఎంపిక చేశాడట.

ఆ పాత్ర కు మరింత మెరుగులు దిద్ది బండ్ల గణేష్‌ కు చెప్పగా మొదట నో చెప్పినా ఆ తర్వాత ఓకే అన్నట్లుగా తెలుస్తోంది.బండ్ల గణేష్‌ నటుడిగా నే కాకుండా మరో వైపు నిర్మాతగా కూడా పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

పవన్‌ తో తన సినిమా ఉంటుందని ఇటీవలే బండ్ల గణేష్‌ ప్రకటించాడు.గత కొన్ని రోజులుగా పవన్‌ చుట్టు కూడా తిరుగుతున్నాడు.

దాంతో పవన్‌ నుండి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు