పుష్ప.ఈ సినిమాను మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు.
టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు.ఈ సినిమా మాములుగా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది.
ఇక బాలీవుడ్ లో అయితే పుష్ప చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.కేవలం మౌత్ టాక్ తోనే అక్కడ 100 కోట్లు వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఇక ఇప్పుడు రిలీజ్ అయినా కార్తికేయ 2 సినిమా కూడా సేమ్ అలానే మాత్ టాక్ తోనే అక్కడ దూసుకు పోతుంది అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.అసలు విషయం ఏంటంటే.
టైర్ 2 హీరోల్లో ఒకరైన నిఖిల్ సిద్ధార్థ్ ప్రెసెంట్ కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నిఖిల్ కెరీర్ లోనే భారీ హిట్ కొట్టిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 తెరకెక్కింది.ముందు నుండి కూడా మంచి అంచనాలతో రిలీజ్ అయినా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దూసుకు పోతుంది.
ఈ సినిమా సక్సెస్ కావడంతో టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు.
ఈ వేడుకలో ఈయన మాట్లాడుతూ.కార్తికేయ 2 సినిమాను పుష్ప సినిమాతో పోల్చారు.
పుష్ప ఎలా అయితే ఎలాంటి అంచనాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో.కార్తికేయ 2 కూడా అదే మాదిరిగా అక్కడ వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
ఈ క్రమంలోనే టీమ్ అభినందనలు తెలిపారు.అల్లు అరవింద్ అలా పోల్చడంతో కార్తికేయ టీమ్ కు మరింత బూస్ట్ లభించింది అనే చెప్పాలి.
ఇక మూడు రోజుల్లోనే కార్తికేయ 2 భారీగా కలెక్షన్స్ సాధిస్తూ దూసుకు పోతుంది.దీంతో నార్త్ లో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్స్ కూడా భారీ స్థాయిలో పెంచేశారు.మొత్తంగా నిఖిల్ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.