రేపు ఆదిలాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.అలాగే ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కారక్రమాలను ప్రారంభించనున్నారు.సుమారు రూ.6 వేల కోట్ల వ్యయంతో రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ ను మోదీ జాతికి అంకిత ఇవ్వనున్నారు.అదేవిధంగా రూ.70 కోట్లతో చేపట్టిన అంబారి – ఆదిలాబాద్ – పింపాలకుట్టి రైల్వే లైన్ జాతికి అంకితం ఇవ్వనున్నారు.కాగా మొత్తం ఆదిలాబాద్ పర్యటనలో రూ.6,697 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు.రూ.491 కోట్లతో ఆదిలాబాద్ – బేలా మధ్య రెండు లైన్ల హైవే విస్తరణతో పాటు రూ.136 కోట్లతో నేషనల్ హైవే -163 పై హైదరాబాద్ – భూపాలపట్నం రహదారి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

 Prime Minister Modi's Visit To Adilabad Tomorrow-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube