Praneeta Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు కస్టడీకి ప్రణీత్ రావు..!!

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును( DSP Praneet Rao ) రెండో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు.

 Praneet Rao In Custody For Second Day In Phone Tapping Case-TeluguStop.com

నిన్న ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతంలో విచారించారు.అదేవిధంగా నిన్న ఎస్ఐబీ ( SIB )కార్యాలయానికి ప్రణీత్ రావును పోలీసులు తీసుకెళ్లారు.

అనంతరం ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు, రికార్డుల మాయంపై సీన్ రీకన్‎స్ట్రక్షన్ చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే 47 హార్డ్ డిస్కులను కొత్త వాటితో రీప్లేస్ చేసినట్లు ఒప్పుకున్న ప్రణీత్ రావు అన్ని రాజకీయ పార్టీల నేతల ఫోన్లను కూడా టాపింగ్ చేసినట్లు అంగీకరించారు.

ఈ నేపథ్యంలో ప్రణీత్ రావు చెప్పిన వాటిపై ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube