తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నాడు.
ప్రకాష్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటి వరకూ తెలుగులో విలన్ పాత్రల్లో ఎక్కువగా నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
అంతే కాకుండా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ కి 100% న్యాయం చేయగల నటుడు ప్రకాష్ రాజ్.ఇతనికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.
ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కూడా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే ఇటీవలే మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ పేరు కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో మారు మోగిపోయిన విషయం తెలిసిందే.
ఇక మా ఎన్నికలలో హీరో మంచు విష్ణు చేతిలో ప్రకాష్ రాజ్ పరాజయం పాలైన విషయం తెలిసిందే.రాజకీయ పరంగా అంతగా కలిసి రాలేక పోయినా నటుడిగా మాత్రం గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ తాజాగా కొన్ని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.అంతేకాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.
ప్రకాష్ రాజ్ 2004లో నంది అవార్డును అందుకున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి తన పాత జ్ఞాపకాలను మరొకసారి నెమరు వేసుకున్నారు.ఇక ఆ ఫోటోలో ప్రకాష్ రాజ్ తో పాటుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి, దాసరి నారాయణరావు ఉన్నారు.గుమ్మడి గారి ఆ స్పర్శ ఆహా అంటూ ఆ ఫోటోలను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ ఫోటోను చూసిన ప్రకాష్ అభిమానులు ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.