బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ఆ తరువాత సాహో సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.అయితే ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రభంజనం సృష్టించలేకపోయింది.
దీంతో ప్రభాస్ కూడా ఈసారి అందరికీ నచ్చే సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు.అంతేగాక ప్రస్తుతం జాన్ అనే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
కానీ ఓ డైరెక్టర్ మాత్రం ప్రభాస్ను హీరో నుండి డెవిల్గా మార్చాలని చూస్తున్నాడు.అర్జున్ రెడ్డి అనే ఒకేఒక్క సినిమాతో టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, అదే సినిమాను బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించి తన సత్తా చాటాడు.
అక్కడ కూడా ఆ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.కాగా బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్తో కలిసి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేశాడు సందీప్.
‘డెవిల్’ అనే టైటిల్తో ఆ ప్రాజెక్ట్ను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలని ప్రయత్నించాడు.కానీ రణ్బీర్ కపూర్ మాత్రం ఆ సినిమా నుండి తప్పుకున్నాడు.
దీంతో సందీప్ అదే సినిమా కథను ప్రభాస్కు వినిపించాడట.కథ బాగా నచ్చిన ప్రభాస్ వెంటనే ‘డెవిల్’ను బయటకు తీయాలని కోరాడట.
ఇక ఇప్పుడు ప్రభాస్ను డెవిల్గా మార్చే పనిలో సందీప్ రెడ్డి పడ్డాడు.మొత్తాని సాహో దెబ్బకు మరోసారి ప్రభాస్ కసిగా డెవిల్ సినిమాను ఒప్పుకున్నాడని చిత్ర వర్గాలు తెలిపాయి.