రాధేశ్యామ్ ని మహేష్ సినిమాతో పోల్చుతున్న నెటిజెన్లు..!

ఈరోజు రిలీజైన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.

సినిమా మంచి లవ్ స్టోరీతో వచ్చినా 300 కోట్ల బడ్జెట్ పెట్టారు కదా దీని కోసమా అన్న అసంతృప్తి కూడా కొందరిలో ఉంది.

లవ్ వర్సెస్ డెస్టినీ మధ్య జరిగే యుద్ధంగా రాధేశ్యామ్ సినిమా వచ్చింది.ఈ సినిమాలో ప్రభాస్ తన ప్రేమని దక్కించు కోవడం కోసం విధి రాతకి ఎదురు తిరుగు తాడు.

అయితే రాధేశ్యామ్ సినిమా చూసిన కొందరు ఆడియెన్స్ ఆ సినిమాను సూపర్ స్టార్ మహేష్ నటించిన మురారి సినిమాతో పోల్చు తున్నారు.కృష్ణవంశీ డైరక్షన్ లో వచ్చిన మురారి సినిమాలో కూడా దేవత శాపం వల్ల జెనరేషన్ లో ఒకరు అకస్మాత్తుగా మరణిస్తారు.

అయితే హీరో టైం కి వచ్చేసరికి పూజలు చేసి విధి రాతని సైతం మార్చేస్తాడు.రాధేశ్యామ్ కథకి మురారి కథకు సంబంధం లేకపోయినా అక్కడ ఇక్కడ పాయింట్ మాత్రం విధి రాతని ఎదురించి నిలబడటమే.

Advertisement

యాంటీ ఫ్యాన్స్ కాస్త రాధేశ్యామ్ సినిమాను మురారితో పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు.సినిమాకు నేషనల్ వైడ్ గా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.

 ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమా మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టేలా ఉంది.

Advertisement

తాజా వార్తలు