ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ లో భారీ మార్కెట్ ను తనకంటూ క్రియేట్ చేసుకున్న స్టార్ ప్రభాస్.బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ వరకు కూడా గుర్తింపు పొందాడు.ప్రెజెంట్ ఈయన నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంచాడు.
ఇక ఈ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్టులతో డార్లింగ్ బిజీగా ఉన్నాడు.
అందులో సలార్ ఒకటి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.
మొన్నటి వరకు ఆగిపోయిన ఈ షూట్ ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
దీంతో పాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా.
ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, మరొక బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తున్నారు.వైజయంతి మూవీస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ రెండు సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.ఈ సినిమా కూడా సైలెంట్ గా షూట్ జరుపు కుంటుంది.ఇలా ప్రభాస్ ఏ స్టార్ హీరో కూడా చేయనన్ని సినిమాలు ఒకేసారి షూట్ చేస్తూ బిజీగా ఉన్నాడు.అయిన కూడా ఇప్పుడు ఈయన లైనప్ లో మరో సినిమా చేరిపోయింది అని టాలీవుడ్, కోలీవుడ్ కోడై కూస్తుంది.
మరి తాజాగా ఈయన లైనప్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా వచ్చినట్టు సమాచారం.ఇటీవలే ఇతడు కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
దీంతో ఈ కాంబో తెరమీదకు రావడంతో ఇప్పుడు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.