ప్రభాస్ ( Prabhas )హోం బ్యానర్ యూవీ క్రియేషన్స్( Uv creations ) అనే విషయం తెల్సిందే.యూవీ క్రియేషన్స్ కు చెందిన నిర్మాతలు వంశీ.
ప్రమోద్ మరియు విక్రమ్ లు ప్రభాస్ కు అత్యంత ఆప్తులు.వీరి నిర్మాణంలో చాలా సినిమాలు వచ్చాయి.
ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా విషయంలో వీరి భాగస్వామ్యం ఏదో ఒక విధంగా ఉంటుంది.ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా యొక్క నిర్మాణ వ్యవహారాల్లో కూడా యూవీ క్రియేషన్స్ వారు ఉన్నారు.
తెలుగు నిర్మాతలు యూవీ క్రియేషన్స్ వారే అంటూ యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.యూవీ క్రియేషన్స్ లో ఇక ముందు సినిమాలు రాకపోవచ్చు అంటూ ఆమధ్య కొందరు పుకార్లు పుట్టించారు.
అందుకు కారణం యూవీ క్రియేషన్స్ నుండి మూడు నాలుగు బ్యానర్ లు వచ్చాయి.యూవీ లోని వారే బయటకు వచ్చి సొంత బ్యానర్ లు ఏర్పాటు చేయడం జరిగింది.
ముఖ్యంగా విక్రమ్ యూవీ కి దూరంగా వచ్చి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ ను ప్రారంభించాడు.దాంతో చాలా మంది యూవీ నిర్మాతల్లో విభేదాలు నిజం అనుకున్నారు.కానీ అసలు విషయం ఏంటి అనేది ఆదిపురుష్( Adipurush ) యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా తేలిపోయింది.మీడియాలో వస్తున్న వార్తలు మొత్తం కూడా అబద్దం అని తేలిపోయింది.
నిన్నటి ఈవెంట్ లో అంతా కూడా చాలా జాలీగా కనిపించారు.
ముగ్గురు కూడా ప్రభాస్ కు వెనుక ఉండి నడిపించారు.ప్రభాస్ కు కుడి బుజం గా ముగ్గురు ఉంటారు.ఇక ముందు కూడా ఉండబోతున్నారు అని నిన్నటి ఈవెంట్ లో కనిపించింది.
కనుక సొంతంగా ఎవరికి వారు సొంత బ్యానర్ లు పెట్టుకుని ఉంటే పెట్టుకోవచ్చు.కానీ యూవీ క్రియేషన్స్ ను కొనసాగించబోతున్నారు.
అంతే కాకుండా యూవీ క్రియేషన్స్ లో ప్రభాస్ యొక్క సినిమా లు ముందు ముందు చాలానే వస్తాయి.వాటికి
వంశీ, ప్రమోద్మ రియు విక్రమ్
లు నిర్మాతలుగా వ్యవహరిస్తారు అంటూ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.