Prabhas AdiPurush: దేవుడా.. ఇది నిజంగా రికార్డే.. ప్రభాస్ కోసం ఆదిపురుష్ ఈవెంట్ కు అంతమంది వచ్చారా?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రభాస్,( Prabhas ) ఆదిపురుష్.( Adipurush ) మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ( Tirupati ) ప్రభాస్ పేరుతో మారుమోగి పోయింది.

తిరుపతి మొత్తం అభిమానులతో నిండిపోయింది.తాజాగా తిరుపతి లోని ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి భారీగా అభిమానులు వచ్చారు.

మూవీ మేకర్స్ కూడా ఈ ఈవెంట్ ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రాండ్ గా మొదలుపెట్టారు.ఆ తర్వాత జైశ్రీరామ్ అనే పాటనే ప్రారంభించి యువతలో ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేశారు.

దాంతో ఎస్వీ యూనివర్సిటీ మొత్తం కూడా జై శ్రీరామ్ ప్రభాస్ అనే పేరుతో మారుమోగిపోయింది.ఇక ప్రభాస్ ఎంట్రీ తో గూజ్ పంప్స్ వచ్చాయని చెప్పవచ్చు.అక్కడ జరుగుతున్న విజువల్స్ చూస్తే ఒక ఈవెంట్ కాకుండా ఒక దేవుడి జాతర జరుగుతున్నట్టుగా ఉంది.

Advertisement

అలా అభిమానులను ఒకరు ఇద్దరు కాదు దాదాపు లక్షకు పైగా అభిమానులు జైశ్రీరామ్ అన్న నినాదాలతో తిరుపతి మారుమోగిపోయింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ ఈవెంట్ కి సంబంధించిన ఒక ఫోటో చక్కర్లు కొడుతోంది.

ఆ ఫోటోలు దాదాపు లక్ష మంది అభిమానులు ఒక డ్రోన్ కెమెరాలు బంధించారు.

ఆ ఫోటోని చూస్తే అసలు వాళ్ళందరూ మనుషులేనా, లేకపోతే అన్న అనుమానం రాక మానదు.కచ్చితంగా వారందరూ కూడా ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్. ప్రభాస్ కోసం ఎండని వాన నీ సైతం లెక్క చేయడం లేదు.

ఇక అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోని చూసిన ప్రభాస్ అభిమానులు నెటిజన్స్ దేవుడా ఇది నిజంగా రికార్డే.ప్రభాస్ ఆదిపురుష్ ఈవెంట్ కి అంతమంది వచ్చారా అంటూ షాక్ అవుతున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు