ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో మునుపెన్నడూ లేని విధంగా ‘ఆదిపురుష్’( Adipurush Movie ) మూవీ టీం తమ సినిమాని వినూతన రీతిలో ప్రమోషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ ప్రొమోషన్స్ కార్యక్రమానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఈ ప్రొమోషన్స్ కి చాలా ఆకర్షితులు అవుతున్నారు.అనాధ పిల్లల కోసం, వృధాశ్రమాల కోసం ఫ్రీ టికెట్స్ ని 10000 వరకు తెలంగాణ వ్యాప్తంగా పంచుతాము అంటూ ఈ చిత్ర నిర్మాతలు ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన చేసారు.
దీనికి అందరూ ప్రశంసించారు, మూవీ టీం ని పొగడ్తలతో ముంచి ఎత్తారు.ఇప్పుడు ప్రొడక్షన్ టీం చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ తమవంతు పాత్ర పోషించడానికి ప్రభాస్ కి( Prabhas ) అత్యంత సన్నిహితమైన కొంత మంది స్టార్ హీరోలు కూడా ముందుకు వచ్చాడు, వారిలో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) గురించి.
బాలీవుడ్ టౌన్ లో ప్రభాస్ కి అత్యంత సన్నిహితుడు ఈయన.నిన్న సాయంత్రం నా వంతుగా 10000 టికెట్స్ అనాధ పిల్లల కోసం తీస్తున్నాను అంటూ అధికారిక ప్రకటన చేసాడు.ఇక రామ్ చరణ్( Ram Charan ) ప్రభాస్ కి అత్యంత సన్నిహిత మిత్రుడు.ఈయన కూడా 10000 టికెట్స్ తియ్యబోతున్నాను అంటూ అధికారికంగా ప్రకటించాడు, అలాగే ప్రభాస్ తో టాలీవుడ్ కి అత్యంత సన్నిహితులైన గోపీచంద్, అనుష్క మరియు అల్లు అర్జున్ కూడా తలో 10000 చెప్పున టికెట్స్ అనాధ పిల్లల కోసం ఉచితంగా తియ్యబోతున్నారట.
అలా ఇండియా వైడ్ గా ప్రభాస్ కి ఉన్న ఆప్త మిత్రులందరూ ఇలా 10000 చొప్పున ఫ్రీ టికెట్స్ తీస్తూ లక్ష టిక్కెట్ల టార్గెట్ రీచ్ ని పెట్టుకున్నారట.అలా విడుదలకు ముందే లక్ష టికెట్స్ అనాధ పిల్లలకోసం ఇస్తున్న ఏకైక సినిమాగా ఆదిపురుష్ చిత్రం నిలిచిందని అంటున్నారు విశ్లేషకులు.
ఇలా విన్నూతనమైన ప్రొమోషన్స్ తో రోజు రోజు కి మూవీ అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు, మరి ఆ అంచనాలను అందుకుతుందో లేదో తెలియాలంటే 16 వ తారీఖు వరకు ఆగాల్సిందే.ఇప్పటికే ఈ సినిమాకి సంబంబించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యింది.తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావాల్సి ఉంది.ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం మంగళవారం రోజు కానీ, బుధవారం రోజు కానీ ప్రారంభం చేసే అవకాశం ఉందట.
ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ లో తెలుగు స్టేట్స్ లో ఎలా ఉండబోతుందో చూడాలి.