ప్రభాస్ హీరోగా తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ అనే భారీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను టీ సీరీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.
సినిమా నుంచి వచ్చిన టీజర్ పై విమర్శలు రాగా బడ్జెట్ లో మరో 100 కోట్లు చేర్చి గ్రాఫిక్స్ ని మరింత పర్ఫెక్ట్ గా చేయనున్నారు.ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక న్యూస్ బయట వైరల్ గా మారింది.
సినిమాలో ప్రభాస్, కృతి సనన్ ల మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయట.
ఆ సీన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని.ఆడియన్స్ ని ఆ సీన్స్ కట్టిపడేస్తాయని అంటున్నారు.ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది.
సినిమాలో సైఫ్ అలి ఖాన్ రావణాసురుడు పాత్ర చేస్తున్నాడు.సలార్ కన్నా ముందే ఆదిపురుష్ ని రిలీజ్ చేయాలని చూస్తున్నా ఆదిపురుష్ సినిమా ఈ ఏడాది చివరి కల్లా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
సినిమాపై ఓం రౌత్ మాత్రం చాలా హోప్స్ పెట్టుకున్నాడు.ఆదిపురుష్ తో పాటుగా ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నాడు.