తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలలో నటించి గుర్తింపు పొందిన పంజాబీ బ్యూటీ నటి పూనమ్ కౌర్ గురించి పరిచయం అవసరం లేదు.ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ సినిమాల కన్నా సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వల్ల పెద్ద ఎత్తున వివాదాల ద్వారా గుర్తింపు పొందారు.
ఇక ఈమె సోషల్ మీడియా వేదికగా ఏదైనా ఒక పోస్ట్ చేసిందంటే అది ఎవరిని ఉద్దేశించి పెట్టిందో తెలియక సతమతమవుతూ ఉంటారు.అదేవిధంగా ఆ పోస్ట్ ఎన్నో వివాదాలకు కూడా కారణమవుతుంటుంది.
ఇలా సోషల్ మీడియా పోస్టుల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన పూనమ్ తాజాగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసి ఆయనతో ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలోని ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నటి పూనమ్ కౌర్ మన్మోహన్ సింగ్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు.
75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈమె మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను కలిసి ఖాదీ తిరంగాను బహూకరించాను.పాకిస్థాన్ లోని గురుద్వారా దగ్గర తీసుకున్న ప్రత్యేకమైన గులకరాళ్ళ బాక్స్ ని కూడా గిఫ్ట్ కూడా ఇచ్చానని ఈమె తెలిపారు.ఇక మన్మోహన్ సింగ్ తో పాటు ఆయన సతీమణి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.ఈ విధంగా మన్మోహన్ సింగ్ గారిని ఆయన సతీమణి కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.