చిన్నప్పుడు పులిలాంటి మనిషిని కలిశా.. వైఎస్సార్ పై పూనమ్ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల కంటే వివాదాస్పద పోస్ట్ ల ద్వారా, కామెంట్ల ద్వారా వార్తల్లో నిలిచే ప్రముఖ సెలబ్రిటీలలో పూనమ్ కౌర్( Poonam Kaur ) ఒకరు.

పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో దేని గురించి పోస్ట్ చేసినా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతుందనే సంగతి తెలిసిందే.

నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పుట్టినరోజు కాగా వైఎస్సార్ తో దిగిన ఫోటోను పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పేదవాళ్లను అడ్డు పెట్టుకొని కేవలం ఓటు, నోటుతో రాజకీయాలను చాలామంది చేస్తుంటారని పూనమ్ అన్నారు.అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి( Former Chief Minister YS Rajasekhar Reddy ) మాత్రం పేదవాళ్ల మనస్సులో చోటు సంపాదించుకున్న అగ్ర నాయకుడు అని ఆమె పేర్కొన్నారు.అనుకోకుండా చిన్నప్పుడు ఈ పులిలాంటి మనిషిని కలిశానని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.

పూనమ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.పూనమ్ కౌర్ చేసిన ఈ పోస్ట్ కు 4300కు పైగా లైక్స్ వచ్చాయి.

Advertisement

అయితే పూనమ్ కౌర్ తెలుగులో కొన్ని పదాలను తప్పుగా పోస్ట్ చేయడంతో నెగిటివ్ కామెంట్లు వచ్చాయి.ఆ కామెంట్ల గురించి పూనమ్ కౌర్ స్పందిస్తూ తప్పుల విషయంలో క్షమించాలని అన్నారు.

అయితే కొంతమంది నెటిజన్లు( Netizens ) మాత్రం పూనమ్ కౌర్ గురించి దారుణంగా ట్రోల్స్ చేస్తుండగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

పూనమ్ కౌర్ ఇన్నిరోజులు లేనిది ఇప్పుడు పోస్ట్ చేయడానికి కారణమేంటని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం పూనమ్ కౌర్ రాజకీయాల్లోకి( Poonam Kaur Politics ) రావాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పూనమ్ కౌర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.పూనమ్ కౌర్ కెరీర్ ప్లానింగ్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

దేవర మూవీపై మళ్లీ విషప్రచారం.. మేకర్స్ కచ్చితంగా అప్రమత్తం కావాల్సిందే!
Advertisement

తాజా వార్తలు