క్రిష్, పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా బుట్టబొమ్మ

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే.

ముకుంద సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ భామ తెలుగు పరిశ్రమని వదిలేసి బాలీవుడ్ లోకి వెళ్ళిపోయింది.

అక్కడ మొదటి సినిమాతోనే డిజాస్టర్ పడటంతో ఇక తప్పనిసరి పరిస్థితిలో మళ్ళీ టాలీవుడ్ లో అడుగుపెట్టింది.ఇక టాలీవుడ్ దర్శకులు ఈ భామని స్టార్ హీరోయిన్ చేసి కూర్చోబెట్టారు.

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకి ఫస్ట్ ఛాయస్ గా పూజా హెగ్డే మారిపోయింది.అక్కినేని అఖిల్ అయితే పూజా హెగ్డే క్రేజ్ మీద నమ్మకంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా చేస్తున్నాడు.

రాధే శ్యామ్ కోసం ప్రభాస్ కి జోడీగా చేసే అవకాశం ఈ అమ్మడు సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో ఒకటి, బాలీవుడ్ లో మూడు సినిమాలు పూజా హెగ్డే చేతిలో ఉన్నాయి.

Advertisement

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్ఠీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం పూజాహెగ్డేని అనుకుంటున్నారు.అలాగే క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోయే పాన్ ఇండియా మూవీ కోసం పూజా హెగ్డేని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు సమాచారం.

ఇప్పటికే చర్చ కూడా జరిగిందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.ప్రస్తుతం క్రిష్ వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.ఈ లోపు పూజా హెగ్డే డేట్స్ కూడా అడ్జస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఆమె అంగీకరించినట్లు తెలుస్తుంది.

మరి ఇది ఇంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే అధికారికంగా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసేంత వరకు వేచి చూడాలి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు