ఎన్టీఆర్ జిల్లా మైలవరం( Mylavaram )లో రాజకీయ వేడి రాజుకుంది.నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేశ్ సభలు, సమావేశాలు జరగనున్నాయి.
ఈ మేరకు ఐతవరంలో మైలవరం నియోజకవర్గం సర్పంచ్ లు, కార్యకర్తలతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

మరోవైపు మైలవరంలో వైసీపీ ఇంఛార్జ్ తిరుపతి రావు మరియు పార్టీ క్యాడర్ తో మంత్రి జోగి రమేశ్( Jogi Ramesh ) సమావేశం కానున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సభకు వెళ్లేవారిపై వేటు వేసేందుకు పార్టీ అధిష్టానం సిద్ధం అయింది.ఇప్పటికే మైలవరం నియోజకవర్గంలోని ప్రాథమిక సహాకార సంఘాల ఛైర్మన్ల పదవీకాలం రెన్యువల్ ను వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే.







