గ్రివేన్స్ సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన ప్రజాఫిర్యాదులను పరిశీలించిన పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్

ఫిర్యాదులపై విచారణ చేపట్టిసత్వర పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.

ఈ రోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన గ్రివేన్స్ సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన ప్రజాఫిర్యాదులను పోలీస్ కమిషనర్ గారు స్వీకరించి పరిశీలించి బాధితులతో మాట్లాడారు.బాధితుల ఫిర్యాదులపై తక్షణ చర్యల నిమిత్తం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో భూ వివాదాలు, కుటుంబ తగాదాలకు,ఇతర ఫిర్యాదులు వరకు వచ్చాయి.ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.

శిక్షణలో భాగంగా గ్రివేన్స్ కార్యక్రమంలో అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ రాధికా గుప్తా గారు పాల్గొన్నారు.

Advertisement

Latest Latest News - Telugu News