నేటి సమాజంలో మనిషిని మనిషి నమ్మడం చాలా ప్రమాదకరంగా మారింది.ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా మోసం చేస్తారో అర్థం కాని పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఏర్పడి ఉంది.
మగవారు, ఆడవారు అని తేడా లేకుండా ఎవరికి ఎలా సాధ్యమవుతుందో అలా అమాయక ప్రజలని మోసం చేస్తూ ఉన్నారు.తాజాగా అర్చన నాగ్ అనే ఒక అమ్మాయి తన అందంతో ప్రముఖులను ముగ్గులోకి దింపి, పరిచయం పెంచుకొని వారితో సన్నిహితంగా ఉంటూ మోసాలకు పాల్పడుతుంది.
ఈ క్రమంలో వారితో తీసుకున్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న అర్చనా నాగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు ఆమెను విచారించగా విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందుతురాలు అర్చనకు భువనేశ్వర్లో విశాలమైన భవనం ఉన్నట్టుగా తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురయ్యారు.ఇక, అర్చన సోషల్ మీడియా ద్వారా ప్రముఖులు, సంపన్నులు, ఉన్నతాధికారులతో పరిచయం ఏర్పరచుకొని,మాటలు కలిపి వారిని తన నివాసానికి వచ్చేలా చేసేది.
వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో సీక్రెట్గా ఫొటోలు, వీడియోలు తీసుకునేది.
అనంతరం వారికి ఈ ఫొటోలు, వీడియోలను పంపించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేది.
తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడేది.ఇంకా చెప్పాలంటే ఆమెకు ఎంతో ఖరీదు చేసే బీఎండబ్ల్యూ, ఫోర్డు తదితర కంపెనీల కార్లు, ఫార్మ్ హౌస్ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.అయితే అర్చనను అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు సెల్ఫోన్లోని ఫొటోలు, వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు తెలిపారు.ఇక ఆమె బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను సైతం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ని కోరినట్టు డీసీపీ ప్రతీక్ సింగ్ వెల్లడించారు.