స్టార్ హోటల్స్ కాని సాధారణ హోటల్స్ కస్టమర్ లకు బంపర్ ఆఫర్లను ప్రకటించడం సహజమే.ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంలో, ఫెస్టివల్ సందర్బంగా, వాలెంటైన్స్ డే సందర్బంగా ఇలా అత్యంత ఆదరణ పండుగలు కలిగిన సందర్భంలో హోటల్స్ కస్టమర్ లను ఆకట్టుకోవడానికి ఆఫర్ లు ప్రకటిస్తాయి.
కాని అప్పుడప్పుడు వాటిని సామాజిక బాధ్యతగా సమాజ హితం గురించి కూడా ఆఫర్ లను ప్రకటిస్తుంటాయి.
అయితే ఇప్పుడు ఓ సంస్థ ఇచ్చిన ఓ ఆఫర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ప్రతి ఏడాది మార్చి 27 న రాత్రి 8:30 నుండి 9:30 వరకు ఎర్త్ అవర్ ను నిర్వహిస్తారు.విద్యుత్ పొదుపును చేయడం లక్ష్యంగా ఈ ఎర్త్ అవర్ ను నిర్వహిస్తారు.
అయితే ఓ సంస్థ ఎర్త్ అవర్ లో పాల్గొన్న వారికి ఒక పిజ్జా ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.ఎర్త్ అవర్ ప్రాధాన్యత ఎక్కువ మందికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే ఈ బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు సదరు సంస్థ యాజమాన్యం తెలిపింది.
ఈ బంపర్ ఆఫర్ పట్ల నెటిజన్లు చాలా బాగా స్పందిస్తున్నారు.వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే ఆఫర్ లను ప్రకటించే ఈ పరిస్థితి ఉన్న ఈరోజుల్లో ఒక సామాజిక బాధ్యత కొరకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించిన సంస్థను, సంస్థ యాజమాన్యాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.