ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పిటిషన్

మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు సీఐడీ జారీ చేసిన నోటీసులను సస్పెండ్ చేయాలని కోరుతూ పునీత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రేపు విచారణకు రావాలని ఇప్పటికే పునీత్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సీఐడీ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పునీత్ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

కాగా ఇదే కేసులో నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులు ఇవ్వడంతో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు.ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14గా ఉన్న లోకేశ్ ను సాయంత్రం 5 గంటల వరకు అధికారులు ప్రశ్నించనున్నారు.

జనసేనలోకి వైసిపి సీనియర్లు ..? ఎవరెవరంటే ?
Advertisement

తాజా వార్తలు