ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వ చివరి పూర్తి బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన సమర్పించనున్నారు.అనేక మంత్రిత్వ శాఖలు దేశ బడ్జెట్ను తయారు చేయడంలో సహకరిస్తున్నప్పటికీ, అతిరథమహారథుల బృందం దానిని సిద్ధం చేయడానికి పగలు, రాత్రి పని చేస్తుంది.
బడ్జెట్ 2023ను సిద్ధం చేసే బృందంలోని సభ్యులు వీరే.
నిర్మలా సీతారామన్ – ఆర్థిక మంత్రి
బడ్జెట్ తయారీ సమయంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని ప్రధాన నిర్ణయాలను తీసుకుని, వాటికి ముద్ర వేసి, ఆపై బడ్జెట్ను సమర్పిస్తారు.ఇందిరాగాంధీ తర్వాత రెండో మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించారు.ఈ ఏడాది ఆమె ఐదో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
టీవీ సోమనాథన్-ఆర్థిక కార్యదర్శి
తమిళనాడు కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఎస్ అధికారి టీవీ సోమనాథన్ ఆర్థిక మరియు వ్యయ కార్యదర్శి.దీనికి ముందు అతను 2015 నుండి 2017 వరకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పీఎంఓలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.
ఎకనామిక్స్లో డాక్టరేట్ డిగ్రీని కలిగి ఉన్నారు.క్వాలిఫైడ్ సీఏ, అకౌంటెంట్ మరియు కంపెనీ సెక్రటరీ కూడా.
సంజయ్ మల్హోత్రా – రెవెన్యూ కార్యదర్శి
సంజయ్ మల్హోత్రా రెవెన్యూ శాఖలో కార్యదర్శి.మల్హోత్రా రాజస్థాన్ కేడర్కు చెందిన 1990 బ్యాచ్ ఐఎఎస్ అధికారి.అతను ఆర్ఈసీ లిమిటెడ్ అనే ప్రభుత్వ కంపెనీకి చైర్మన్, ఎండీగా ఉన్నారు.
వీ.అనంత నాగేశ్వరన్-ముఖ్య ఆర్థిక సలహాదారు
వీ.అనంత్ నాగేశ్వరన్ దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు, సీతారామన్ బృందంలోని ముఖ్యమైన వ్యక్తులలో ఆయన ఒకరు.నాగేశ్వరన్ మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుండి ఫైనాన్స్లో పీహెచ్డీ మరియు ఐఐఎం అహ్మదాబాద్ నుండి ఎంబీఏ పట్టా పొందారు.
తుహిన్ కాంత్ పాండే-డీఐపీఎంఏ సెక్రటరీ
1987 ఒడిశా కేడర్ ఐఎఎస్ అధికారి, తుహిన్ కాంత్ పాండే పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ శాఖ కార్యదర్శి.ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించడంతోపాటు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి)ని స్టాక్ మార్కెట్లో గతేడాది లిస్టింగ్ చేసిన ఘనత తుహిన్ కాంత్ పాండేకే దక్కుతుంది.
అజయ్ సేథ్ – ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి
అజయ్ సేథ్ 1987 కర్ణాటక కేడర్ IAS అధికారి, ఏప్రిల్ 2021లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులయ్యారు.సేథ్ మెకానికల్ ఇంజనీర్ మరియు మేనేజ్మెంట్ పోస్ట్-గ్రాడ్యుయేట్.
వివేక్ జోషి- ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి
హర్యానా కేడర్కు చెందిన 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన వివేక్ జోషి 19 అక్టోబర్ 2022న ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు.