కడప జిల్లా మైలవరం వద్ద పెన్నా అప్రోచ్ రోడ్డు మళ్లీ కొట్టుకుపోయింది.వారం క్రితం పెన్నా అప్రోచ్ రోడ్డును తాత్కాలికంగా నిర్మించిన విషయం తెలిసిందే.
తాజాగా కురిసిన వర్షాల నేపథ్యంలో వరద ఉధృతికి రోడ్ కొట్టుకుపోయింది.దీంతో పెన్నా నది చుట్టూ ఉన్న 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మత్తు పనులు చేయాలని, ఇటువంటి పరిస్థితులు మళ్లీ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.