ఫ్యాషన్ ప్రపంచంలో ఉండే అందాల భామలు ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికి అందుబాటులో ఉంటారు.తమని ప్రేక్షకులు మరిచిపోకుండా ఉండటం కోసం గ్లామర్, హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతూ ఉంటారు.
ఈ ఫోటో షూట్ లు చూడటానికి లక్షల సంఖ్యలో సదరు అందాల భామలని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు.ఇక సినిమా అవకాశాలు ఎక్కువగా ఉండి స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారు సోషల్ మీడియాకి కాస్తా దూరంగా ఉండటం, లేదంటే కేవలం వారికి సంబందించిన విషయాలు షేర్ చేసుకోవడం కోసం మాత్రమే అందుబాటులో ఉంటారు.
అయితే సినిమా అవకాశాలు పెద్దగా లేని భామలు మాత్రం ఫోటో షూట్ లు అంటూ ప్రతి రోజు తమ అందాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని కనువిందు చేసే విధంగా ఆరబోస్తూ ఉంటారు.
ఈ విషయంలో బాలీవుడ్ భామలు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు.
వారికి ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆదాయం కూడా రావడంతో ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ ఉంటారు.ఈ విషయంలో మన తెలుగు హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా బాలీవుడ్ భామలతో పోటీ పడుతూ ఉంటుంది.
ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అనుకున్న ఈ భామకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.పెద్ద హీరోలతో సినిమాలు చేసిన తన పెర్ఫార్మెన్స్ చూపించుకునే రేంజ్ పాత్రలు కావు.
ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలకి పరిమితం అయిన పాయల్ రాజ్ పుత్ లాక్ డౌన్ టైం లో ఫ్యాన్స్ కి కాస్తా ఉత్సాహం అందించే విధంగా డిఫరెంట్ గా ఫోటో షూట్ లు చేసుకుంటూ వాటిని షేర్ చేస్తుంది.ఆ మధ్య పిల్లో చాలెంజ్ అంటూ ఒంటికి బట్టలు లేకుండా పిల్లో మాత్రమే కట్టుకొని ఫోటోలు పెట్టిన ఈ అమ్మడు, ఇప్పుడు ఒంటికి డ్రెస్ మాదిరి పేపర్ చుట్టుకొని ఫోటో ఫోజులు ఇచ్చింది.
ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి పాయల్ పెట్టిన ఈ పేపర్ చాలెంజ్ లో ఎంత మంది భామలు పాల్గొని వారి అందాల విందు అందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.