నందమూరి నటసింహం బాలయ్య సినిమాలు చేస్తూనే ఒక టాకింగ్ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.అన్ స్టాపబుల్ షో తో బాలయ్య మొదటిసారి వ్యాఖ్యాతగా మారిపోయిన విషయం తెలిసిందే.
ఈ షో సీజన్ 1 ఘన విజయం సాధించింది.సీజన్ 1 అనుకున్న దాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో పార్ట్ 2 స్టార్ట్ చేసారు.
ఆహా వారు పార్ట్ 2 ను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్టార్స్ ను గెస్టులుగా తీసుకు వస్తూ వారి ఫ్యాన్స్ కు ఫుల్ ఎగ్జైట్ మెంట్ కలిగిస్తున్నారు.మరి తాజాగా ఈ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విచ్చేసిన విషయం తెలిసిందే.
మరి ఇది రెండు పార్టులుగా రాబోతున్నట్టు ప్రకటించారు.పవన్ మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 2న ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అయ్యింది.
ఈ ఎపిసోడ్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే వైరల్ అయ్యింది.
బాలయ్య పవర్ స్టార్ నుండి చాలా ఆసక్తికర విషయాలను కూడా రాబట్టాడు.దీంతో ఈ ఎపిసోడ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది.మరి ఈ విషయం గుర్తించిన ఆహా వారు రెండవ ఎపిసోడ్ విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు.
ఒకరోజు ముందుగానే ఈ ఎపిసోడ్ రాబోతుంది అని తెలుస్తుంది.పార్ట్ 2 ఫిబ్రవరి 10న రావాల్సి ఉండగా ఇప్పుడు ఒకరోజు ముందుగానే ఫిబ్రవరి 9న స్ట్రీమింగ్ చేయనున్నారు.
మరి ఆహా వారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ మొదటి ఎపిసోడ్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంత ఆత్రుత పడ్డారో.రెండవ ఎపిసోడ్ కోసం కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని తెగ సెర్చ్ చేస్తుండడంతో ఆహా వారు ఫ్యాన్స్ కోసం మొదటి ఎపిసోడ్ కు ఉపయోగించిన వ్యూహాన్ని రెండవ ఎపిసోడ్ కోసం కూడా ఉపయోగిస్తున్నారు.చూడాలి ఇది ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో.