తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకల గ్రామంలో దివీస్ పరిశ్రమ విషయంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.మనుషుల ప్రాణాలకు ముప్పు ఉండే ఇటువంటి పరిశ్రమలు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసివేసేలా చర్యలు తీసుకుంటామని మాట ఇవ్వటం జరిగింది.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కొత్తపాకల గ్రామంలో దివీస్ పరిశ్రమ విషయంలో అలసత్వం ప్రదర్శించడంతో.
ఆ పరిశ్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడం కోసం పోరాటం చేస్తున్న స్థానిక ప్రజలను పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.గ్రామస్తులను పోలీసులు అరెస్టు చేయడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో జగన్ ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి.
ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దివీస్ పరిశ్రమ ప్రాంతం కొత్తపాకల గ్రామంలో పర్యటించి పరిశ్రమ స్థాపన ని అడ్డుకోవాలని .అరెస్టయిన గ్రామస్థులను విడుదల చేయాలని కోరడం జరిగింది.పరిస్థితి ఇలా ఉన్న తరుణంలో జగన్ ప్రభుత్వం అరెస్టయిన గ్రామస్తులకు బెయిల్ వచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు.పార్టీ తరఫున లెటర్ విడుదల చేశారు.
‘దివీస్ కర్మాగారంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇబ్బంది పడుతున్నాయని.వారి సమస్యలను సైతం జగన్ పరిష్కరించాలని కోరారు.
దివీస్ నిరసనకారులను ప్రభుత్వం విడుదల చేయడం సంతోషం కలిగించిందన్నారు.ఈ సందర్భంగా హైకోర్టుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.