Pawan Kalyan : జగన్ మీరు దేనికి సిద్ధం అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సమక్షంలో ఎంపీ బాలశౌరి జనసేనలో జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ నిర్వహిస్తున్న "సిద్ధం" సభలపై సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సిద్ధం అంటూ నిర్వహిస్తున్న సభలలో వైఎస్ జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా ఉందని వ్యంగ్యంగా సెటైర్లు వేశారు.సీఎం జగన్ అర్జునుడిలా ఫీలవుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు.

సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని వ్యక్తి.అర్జునుడితో పోల్చుకోవడం విడ్డూరం అని అన్నారు.

మమ్మల్ని జగన్ కౌరవులు అంటున్నారు.

Advertisement

ఇది కలియుగం కౌరవులు పాండవులతో పోల్చుకోకండి.జగన్ మాట్లాడితే సిద్ధం అంటున్నారు.దేనికి సిద్ధం? సొంత చెల్లెలికి గౌరవం ఇవ్వని జగన్ ప్రజలకు గౌరవం ఇస్తారా? ఆమెపై వైసీపీ శ్రేణులు నీచంగా మాట్లాడినా పట్టించుకోరు.జగన్( YS Jagan Mohan Reddy ).ఎన్నికల రంగంలోకి వస్తున్నాం.సభలు పెడతాం అని పేర్కొన్నారు.2014లో పార్టీ పెట్టే సమయంలో ఉంటే ఉంటాం పోతే పోతాం.కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరింప చేయాలని తెగింపుతో రాజకీయాల్లో అడుగుపెట్టినట్లు పవన్ వ్యాఖ్యానించారు.

పార్టీని నడపాలంటే నిధులు కాదు కావాల్సింది.అందరిని కలిపే ఒక భావం కావాలని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంపై ఎంతో అవగాహన ఉన్న ఎంపీ బాలశౌరి( Balashowry ) పార్టీలో జాయిన్ అవ్వటం పార్టీకి మరింత బలం చేకూరింది.తానెప్పుడూ ఎన్నికల గురించి ఆలోచించలేదని వచ్చే తరాలు గురించి ఆలోచించినట్లు తెలిపారు.

2024 ఎన్నికలలో విజయం అంత తేలికేమి కాదు అందరూ కష్టపడాలి.కానీ ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం స్థాపిస్తం అని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !
Advertisement

తాజా వార్తలు