తెలుగులో తళుక్కున మెరిసి తెరమరుగైన ఈ హీరోయిన్ ఇప్పుడు  ఏం చేస్తుందంటే... ?

తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు ఏఆర్ రాజరాజా దర్శకత్వం వహించిన "సీతాకోక చిలుక" అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ "షీలా కౌర్" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో అవకాశాల కోసం కొంతమేర తీవ్రంగా శ్రమించినప్పటికీ 2008వ చిత్రంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కావడంతో ఒక్కసారిగా పరుగు చిత్రం ఈ అమ్మడి సినీ జీవితాన్ని మలుపు తిప్పింది.దీంతో వరుసగా కన్నడ, మలయాళం, తమిళం, హిందీ, తదితర భాషలలో సినిమా అవకాశాలను దక్కించుకుంది.

ఈ క్రమంలో తెలుగులో పరుగు చిత్రం తరువాత మస్కా, అదుర్స్, పరమవీర చక్ర, తదితర చిత్రాలలో నటించింది.ఈ చిత్రాలు పర్వాలేదనిపించినప్పటికీ ఎందుకో కొత్త సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కొంతమేర ఇబ్బందులను ఎదుర్కొంది.

ఈ క్రమంలో తన వైవాహిక జీవితంపై దృష్టి సారించింది.దీంతో సినిమా పరిశ్రమకు చెందిన "సంతోష్ రెడ్డి" అనే వ్యక్తిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంది.

Advertisement

ఈ పెళ్లి షీలా కౌర్ కి సంబందించిన అతి కొద్ది మంది సన్నిహితులు మరియు బంధువుల మధ్యలో జరిగింది.పెళ్లయిన తర్వాత షీలా కౌర్ మళ్లీ సినిమాలలో నటించలేదు.

కాగా చివరగా కన్నడలో 2018వ సంవత్సరంలో "హైపర్" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.తెలుగులో మాత్రం 2011 సంవత్సరంలో నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా నటించినటువంటి "పరమవీర చక్ర" అనే చిత్రంలో మూడవ హీరోయిన్ గా నటించింది.

కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం షీలా కౌర్ చేతిలో ఎలాంటి సినిమా అవకాశాలు లేవు.

దీంతో ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపార రంగంలో రాణించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

వీడియో: ట్రైన్ బోగీ మెట్లపై కూర్చున్న వ్యక్తి.. జారిపోవడంతో..?
Advertisement

తాజా వార్తలు