నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమంట్ ఒక భవనం కాదన్న ఆయన 140 కోట్ల ప్రజల ఆకాంక్షలు, కలల ప్రతిబింబం అని తెలిపారు.
ఆత్మ నిర్భర్ భారత్ కు సాక్షిగా పార్లమెంట్ నిలుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.వికసిత్ భారత్ ను నూతన పార్లమెంట్ చూస్తుందన్నారు.
దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పారు.మే 28 ఇకపై అటువంటి రోజుగా మారుతుందని అన్నారు.
భారత్ ముందుకు వెళ్తే ప్రపంచం ముందుకు వెళ్తుందని వెల్లడించారు.