చంద్రునిపైకి భారతదేశం పంపిన లూనార్ మిషన్ చంద్రయాన్-3( Chandrayaan-3 ) ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయి చరిత్ర సృష్టించింది.ఈ సంఘటన పాకిస్థాన్తో( Pakistan ) సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్గానూ మారింది.పాకిస్థాన్లో చాలా మంది ఈ విజయాన్ని జీర్ణించుకోలేకపోయారు.
అందులో పెద్ద గొప్పేముంది? మేము కూడా రాకెట్లను జాబిల్లిపైకి పంపిస్తాం అన్నట్లు వారు కొన్ని ఫన్నీ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.వాటిని చూసి శునకానందం పొందుతున్నారు.
కొందరైతే చంద్రుడి మీదకి ఏకంగా మనుషులను పంపించినట్లు ఫన్నీ వీడియోలు క్రియేట్ చేసి భారతీయులను నవ్విస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ట్విట్టర్లో టిక్టాక్ వీడియో ఒకటి షేర్ చేశారు.ఈ వీడియోలో ముగ్గురు పాక్ వ్యక్తులు నసీమ్( Naseem ) అనే వ్యక్తిని చంద్రునిపైకి పంపినట్లు పేర్కొంటూ ఓ ల్యాబ్లో పనిచేస్తున్నట్లు నటించారు.టేకాఫ్ సమయంలో నసీమ్ హాస్యాస్పదంగా రాకెట్ను( Rocket ) జారవిడుచుకోవడంతో వీడియో ప్రారంభం నుంచే నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోయారు.
అతను అంతరిక్షంలోకి ఎగురుతున్నట్లు కనిపించేలా చేయడానికి వారు స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించారు.నిజంగా చంద్రునిపైకి వస్తాడా లేదా అనే దాని గురించి ల్యాబ్లోని సిబ్బంది కామెంట్రీ చేస్తూ కూడా ఈ వీడియోలో కనిపించారు, పాకిస్థాన్ ఇలా చేయగలదని భారతదేశం ఎప్పుడూ ఊహించదు అని కూడా వారు ఫన్నీ కామెంట్లు చేశారు.

వీడియోలో కనిపించిన ప్రకారం నసీమ్ తన ప్రయాణంలో ఒక కనిపించని కనెక్షన్ ద్వారా ల్యాబ్తో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు.అది కూడా అందరి చేత నవ్వులు పూయించింది.అతను దారిలో ఒక చైనీస్ ఉపగ్రహాన్ని కూడా చూస్తాడు.చివరికి చీకటిలో ఊహించని ప్రదేశంలో ల్యాండ్ అవుతాడు.దానిని నెటిజన్లు “నరకం” అని సరదాగా వ్యాఖ్యానించారు.చివరగా, నసీమ్ తిరిగి చంద్రుని వద్దకు వెళ్లి మరింత నవ్వు తెప్పించాడు.
భారతదేశంలో టిక్టాక్ నిలిపివేసినందున, ఈ వీడియో చంద్రయాన్-3 ల్యాండింగ్కు ముందు లేదా తర్వాత సృష్టించబడిందా అనేది తెలియ రాలేదు.







