యాపిల్ పై పాకిస్థాన్ యాంకరమ్మ అజ్ఞానం,ఆడుకుంటున్న నెటిజన్లు

ఇప్పుడు సామాన్య ప్రజలు అయినా, సెలబ్రిటీ లు ఎవరైనా కూడా చిన్న చిన్న తప్పులు చేస్తే సోషల్ మీడియా వేదికగా వారిని నెటిజన్లు ఏకి పారేస్తున్నారు.

అయితే ఇది ఒక్క దేశానికే పరిమితం కావడం లేదు.

ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ని ఉపయోగించుకొని దేశాధినేతలను అయినా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.అయితే తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఒక యాంకర్ తనకు తెలిసీ తెలియని నాలెజ్డ్ తో మాట్లాడిన ఒక చిన్న మాట ఇప్పుడు ఆమె సోషల్ మీడియా స్టార్ అయిపొయింది.

ఆమెను ట్రోల్ చేస్తూ నెటిజన్లు తెగ జోకులు పేలుస్తున్నారు.ఒక్క పాక్ లోనే కాదు దేశ విదేశాల్లో కూడా ఈ అమ్మడి వీడియో విపరీతంగా వైరల్ గా మారిపోయింది.

ఎవరికీ నాలెజ్డ్ ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని ఉద్యోగాలు చేసే వారు తప్పకుండా అన్ని విషయాల గురించి తెలియాల్సి ఉంటుంది.ముఖ్యంగా ఇలాంటి ఉద్యోగాల్లో చెప్పుకొనేది న్యూస్ రీడర్స్,న్యూస్ యాంకర్స్ ఇలా.వీరి ఉద్యోగాల్లో వీరికి ప్రతి ఒక్కదానిపై అవగాహన ఉండాల్సి ఉంటుంది.కానీ ఈ పాక్ కు చెందిన ఒక టీవీ యాంకర్ యాపిల్ పండుకు ప్రఖ్యాత యాపిల్ ఉత్పత్తుల సంస్థకు మధ్య తేడా గుర్తించకుండా లైవ్ ప్రోగ్రాం లో అడ్డంగా దొరికిపోయింది.

Advertisement

దీనితో ఆమె అజ్ఞానానికి నెటిజన్లు తెగ జోకులు పేలుస్తున్నారు.వివరాల్లోకి వెళితే.పాక్ కు చెందిన ఒక టీవీ చానల్లో ప్రసారమవుతున్న షోకు హాజరైన ఆర్థిక ప్రముఖుడు ఒకరు పాకిస్తాన్ బడ్జెట్ కంటే ఒక్క యాపిల్ సంస్థ వ్యాపారమే చాలా ఎక్కువని పేర్కొన్నారు.

నాన్ స్టాప్ గా మాట్లాడేస్తున్న అతగాడి మాటల్ని అలా విన్నా సరిపోయేది.

కానీ ఆ యాంకరమ్మ ఆ పని చేయకుండా అవునవును యాపిల్ పండు బిజినెస్ ఎక్కువంటూ ఎదో మాట్లాడాలని మాట్లాడేసింది.అంతే ఆమె మాటలకు అతిధి కూడా అవాక్కయి తరువాత వెంటనే నేను మాట్లాడేది యాపిల్ మొబైల్ ఫోన్ వ్యాపారం గురించి యాపిల్ పండ్ల వ్యాపారం కాదు చెప్పడం తో అప్పుడు ఆమె రియలైజ్ అయ్యింది.ఇక ఒక చిన్న చిరు నవ్వుతో ఆమె చేసిన మిస్టేక్ ని కవర్ చేసే ప్రయత్నం చేసింది.

అయితే నెటిజన్లు ఊరుకుంటారా ఈ సన్నివేశానికి సంబందించిన వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేయడం తో ఈ వీడియో వైరల్ గా మారింది.తరచూ పాక్ ఆర్థిక స్థితిని యాపిల్ సంస్థ బిజినెస్ రేంజ్ తో పోల్చటం మామూలే.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అయినప్పటికీ సదరు యాంకరమ్మ ఆ విషయంలో ఎలా పప్పులో కాలేసిందో అర్ధం కావడం లేదు.అయితే యాంకరమ్మ యాపిల్ మాటలతో వైరల్ అవుతున్న ఈ 32 సెకన్ల చిట్టి వీడియోపై సోషల్ మీడియాలో ఇప్పుడు భారీగా జోకులు పేలుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు