శర్వానంద్, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘పడి పడి లేచే మనసు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.
అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో మంచి విజయాలను దక్కించుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఆమద్య వచ్చిన ‘లై’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాడు.ఏమాత్రం ఆకట్టుకోని కథ, కథనాలతో ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రంపై ఎక్కువ శ్రద్ద పెట్టి తెరకెక్కించాడు.
ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.అందుకే ఈ చిత్రంలో సాయి పల్లవిని హీరోయిన్గా ఎంపిక చేయడం జరిగిందని సమాచారం అందుతోంది.ఇక ఈ చిత్రం కథ గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.ఈ చిత్రం కొన్ని నెలల క్రితం వచ్చిన ‘తేజ్ ఐ లవ్ యూ’ చిత్రంకు కాపీ అంటూ పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
తేజ్ ఐలవ్ యూ మూవీలో హీరోయిన్ హీరో ప్రేమించుకుంటారు.హీరోయిన్ యాక్సిడెంట్లో గతంను మర్చి పోతుంది.దాంతో హీరో నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
‘పడి పడి లేచే మనసు’ చిత్రంలో కూడా కథ సేమ్ స్టోరీ లైన్ అంటూ ప్రచారం జరుగుతుంది.కాకతాళీయంగా జరిగిందా లేదంటే కావాలని చేశారో తెలియదు కాని ఈ చిత్రంలో మాత్రం ఆ కథ పడినది.కథ సేమ్ అయినా నరేషన్ పూర్తి విభిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు గట్టిగా చెబుతున్నారు.
శర్వానంద్, సాయి పల్లవిలు ఆకట్టుకుంటారని చిత్ర యూనిట్ సభ్యులు నమ్ముతున్నాడు.క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.