ఉమ్మడి విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ గారి ఆధ్వర్యంలో అరకు నియోజకవర్గం కొత్త భల్లు గూడా పంచాయతీ,కొర్రాగుడా,సుకూరు గూడా గ్రామాలలో పంచాయితీ సర్పంచ్ కోర్ర రాధిక అధ్యక్షతన,గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అరకు ఎంపీ శ్రీమతి గొడ్డేటి మాధవి గారు,విశాఖ పట్నం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర గారు పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున గ్రామస్తులు స్వాగతిస్తూ,జగనన్న సంక్షేమ పథకాల వల్ల తమ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయంటూ,తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అం ద్వారా ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు జగనన్న ప్రభుత్వం అందిస్తున్న,మెరుగైన పరిపాలనను వివరిస్తూ,స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా అధికారులతో సంప్రదిస్తూ ముందుకు సాగారు.
ఈ కార్యక్రమం చేపట్టడం వలన గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అని అరకు ఎంపీ శ్రీమతి మాధవి అన్నారు .ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎంపీపీలు వైస్ఎంపీపీలు,సర్పంచులు,ఎంపిటిసిలు,జిల్లా,మండల స్థాయి నాయకులు,అధికార,యంత్రాంగం,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.







