వాల్తేరు వీరయ్య తో అసలైన సంక్రాంతి - సినీ ఎడిటర్ చోటా కె ప్రసాద్

రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో ఉన్నప్పటికీ తాను ఈ సంవత్సరమే అసలైన సంక్రాంతి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా జరుపుకుంటున్నానని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన సినీ ఎడిటర్‌ చోటా కె ప్రసాద్ తెలిపారు.

ఆ సినిమాకు ఈయన ఎడిటర్‌గా పనిచేశారు.

ప్రస్తుతం ఆ సినిమా థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్లు సాధించడంతో ప్రసాద్‌కు మంచి గుర్తింపు వచ్చింది.సంక్రాంతికి స్వగ్రామం వచ్చిన ప్రసాద్ స మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ప్రతి ఏటా స్వగ్రామం వస్తానని కానీ అసలైన సంక్రాంతి ఈ ఏడాది జరుపుకుంటున్నానని ఆనందం వ్యక్తం చేసారు.

సినీ రంగంలో ప్రముఖ కెమెరామెన్లు చోటా కె నాయుడు, శ్యాంమ్ కె నాయుడులు ఈయన బాబాయిలు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు