తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పార్టీ హైకమాండ్ నిర్ణయించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ నాయకత్వం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అడుగుజాడల్లో నడుస్తానని చెప్పారు.
కేసీఆర్ ను ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు.కేసీఆర్ బలం, బలహీనతలు తనకు తెలుసన్న ఈటల రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి పని చేస్తామని తెలిపారు.
తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.