యాదాద్రి ఆలయంపై మరోసారి డ్రోన్ కలకలం చెలరేగింది.యాదాద్రి ఆలయంపై ఇద్దరు యువకులు డ్రోన్ ప్రయోగించినట్లు గుర్తించారు.
ఎటువంటి అనుమతి లేకుండా ఆలయ చిత్రాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో వెంటనే గుర్తించిన ఆలయ సిబ్బంది ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
డ్రోన్ తో పాటు కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఆలయ అధికారులు సదరు యువకులను పోలీసులకు అప్పగించారు.







