యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్.టి.ఆర్ 30వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుందని తెలుస్తుంది.
ఎన్.టి.ఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది.సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టే.
ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ న్యూస్ ఫ్యాన్స్ ని ఎక్సయిట్ అయ్యేలా చేస్తుంది.సినిమాను ముందు ఒక పార్ట్ గానే తీయాలని అనుకున్నా ఇప్పుడు రెండు పార్ట్ లుగా తీయాలని స్కెచ్ వేశారట.
ఎన్.టి.ఆర్ 30వ సినిమా రెండు పార్టులుగా రాబోతుందని టాక్.బాహుబలి, కె.జి.ఎఫ్, పుష్ప సినిమా తరహాలోనే ఎన్.టి.ఆర్ 30వ సినిమాని కూడా రెండు పార్టులుగా ప్లాన్ చేస్తున్నారట.అయితే చిత్రయూనిట్ ఇది లీక్ అవకుండా జాగ్రత్త పడాలని అనుకున్నా ఫిల్మ్ సర్కిల్స్ ద్వారా ఈ మ్యాటర్ బయటకు లీక్ అయ్యింది.ఎన్.టి.ఆర్ కూడా రెండు పార్ట్ ల సినిమాతో సత్తా చాటనున్నాడు. ఆచార్య ఎఫెక్ట్ కొరటాల శివ మీద ఉన్నా తారక్ సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు కొరటాల శివ.