ప్రస్తుతం కరోనా ఎంతలా విజ్రుంభిస్తుందో మనం చూస్తున్నాం.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.
మొదటి దఫా వైరస్ లో కరోనా కేసులు నమోదైనా, రెండో దఫా వైరస్ తో పోలిస్తే మరణాలు మాత్రం ఎక్కువగా నమోదు కాలేదు.కాని రెండో దఫా వైరస్ లో కేసులు భారీగా నమోదవుతూనే మరణాలు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి.
అయితే మొదటి దఫాలో యువతపై పెద్దగా ప్రభావం చూపని కరోనా ఈసారి వృద్ధులు కోలుకుంటూ యువత కరోనా బారిన పడి మరణిస్తున్నారు.అయితే సామాన్యుల మొదలు సెలెబ్రెటీల వరకు కరోనా బారిన పడుతున్నారు.
ఇప్పటికే కరోనా బారిన పడి మరణించిన సెలెబ్రెటీలు కూడా ఉన్నారు.ఒక్కసారిగా అస్వస్థతతో ఆసుపత్రులలో చేరిన సెలెబ్రెటీలు తిరిగి అభిమానులను పలకరించకుండానే తనువు చాలిస్తున్న పరిస్థితి ఉంది.
ఇప్పటికే అల్లు అర్జున్, చిరంజీవి, రాజశేఖర్, నిర్మాత అల్లు అరవింద్ ఇలా చాలా మంది సెలెబ్రెటీలు కరోనా బారిన పడ్డారు.కరోనా నుండి రికవరీ అయిన పరిస్థితి ఉంది.
తాజాగా ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే.అయితే షూటింగ్ లు అన్ని నిలిపివేసి ఇంటిపట్టునే ఉంటున్నా ఎన్టీఆర్ కు కరోనా ఎలా సోకిందనే దానిపై చర్చ మొదలైంది.
అయితే తాజాగా వివాహ వార్షికోత్సవ వేడుకలు ఎన్టీఆర్ సన్నిహితుల మధ్య నిర్వహించుకున్నా వారిలో ఎవరితో ఒకరి చేత కరోనా వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.