బెల్లంకొండ సాయి గణేష్ ని హీరో గా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించిన స్వాతిముత్యం చిత్రం ఈనెల 5 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాలు నడుమ తెరకెక్కిన స్వాతిముత్యం చిత్రం ఏకంగా చిరంజీవి మరియు నాగార్జున సినిమా లకు పోటీగా రాబోతున్న నేపథ్యం లో అందరి దృష్టి ఆకర్షించబడుతుంది.
ఈ సమయం లో స్వాతిముత్యం చిత్రం ను నిర్మించిన నాగ వంశీ మాట్లాడుతూ కచ్చితంగా ఇది ఒక మంచి చిత్రంగా నిలుస్తుందని, ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా ఈ సినిమా కు వస్తారని చెప్తున్నాడు.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో నాగ వంశీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు.
ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది అదేనండి లక్ష్మీ ప్రణతి యొక్క సోదరుడు అయిన నార్నే నితిన్ ని హీరోగా పరిచయం చేయబోతున్నట్లుగా నాగ వంశీ అధికారికంగా ప్రకటించాడు.
ఇప్పటికే నార్నే నితిన్ హీరో గా ఒక సినిమా అధికారికం గా ప్రకటించబడింది.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కిందే లేదు.ఎట్టకేలకు నాగ వంశీ తమ నిర్మాణం లో ఒక సినిమా ను నార్నే నితిన్ తో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
తాజాగా నిర్మాత ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు.ఎన్టీఆర్ అన్న యొక్క బావమరిదిని తాము పరిచయం చేయబోతున్నామని.
ఒక అద్భుతమైన సినిమా ను అతనికి ఇస్తాం అన్నట్లుగా నాగ వంశీ ధీమా వ్యక్తం చేశారు.అయితే ఎన్టీఆర్ వీళ్లకు ఛాన్స్ ఇవ్వాలంటే బెల్లంకొండ సాయి గణేష్ ని సక్సెస్ చేయాలంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.
స్వాతి ముత్యం సినిమా సక్సెస్ అయ్యి బెల్లంకొండ సాయి గణేష్ కి మంచి పేరు వస్తేనే ఎన్టీఆర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు నార్నే నితిన్ ని ఆయన చేతిలో పెడతారంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.స్వాతిముత్యం సినిమా పై ఆయనకున్న నమ్మకాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందని, కనుక ఆ సినిమా సక్సెస్ అవుతుంది కనుక ఎన్టీఆర్ బావమరిది మొదటి సినిమా కి నిర్మాతగా వ్యవహరించే అవకాశం నాగ వంశీ కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.