యంగ్ టైగర్ ఎన్టీఆర్( Jr ntr ) మరియు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రూపొందబోతుంది.దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.
కేజీఎఫ్ 2( Prashanth neel ) సినిమా స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
కనుక ఎన్టీఆర్ అభిమానులు ఓ రేంజ్ లో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.కేజీఎఫ్ సినిమా ను మించిన భారీ యాక్షన్ సన్నివేశాలతో ఎన్టీఆర్ తో సినిమాను రూపొందించబోతున్నట్లుగా ఆ మధ్య ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
తాజాగా ఎన్టీఆర్ దేవర సినిమా( Devara )ను మొదలు పెట్టాడు.ఈ ఏడాది చివరి వరకు సినిమాను ముగించబోతున్నాడు.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలో కేజీఎఫ్ మేకర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమా ను రూపొందిస్తున్నాడు.
సెప్టెంబర్ లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
సలార్ పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఎలాంటి హడావుడి లేదు అని అభిమానులు అనుకుంటున్నారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ యొక్క సినిమా చర్చలు జరుగుతున్నాయి.
ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేయడం జరిగిందట.ఆమెకు అయిదు కోట్ల రూపాయలు పారితోషికంగా ఇవ్వబోతున్నారు.
అంతే కాకుండా 2025 సంవత్సరం లో ఎన్టీఆర్.మరియు ప్రశాంత్ కాంబో లో రూపొందబోతున్న సినిమా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి ఎన్టీఆర్ యొక్క ప్రశాంత్ నీల్ సినిమా పై ఉన్న ఆసక్తికి తగ్గట్లుగా ఉంటుందని తెలుస్తోంది.మరో వైపు వార్ 2 సిని(War 2 )మా లో కూడా జూనియర్ నటించబోతున్న విషయం తెల్సిందే.