యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ( NTR )కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్.టి.ఆర్ 30వ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రెడీ కానుంది.ఈ నెల చివరన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
ఆచార్య తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో కొరటాల శివ( Koratala Shiva ) ఈ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్( Janhvi Kapoor ) ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
జాన్వి ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.అయితే పాన్ ఇండియా సినిమా మరి అలాంటిది ఒక్క హీరోయిన్ ఎలా సరిపోతుంది.అందుకే సినిమాలో సెకండ్ హీరోయిన్ ని కూడా దించుతున్నారట.
కథ డిమాండ్ మేరకు సెకండ్ హీరోయిన్ కూడా ఉండాల్సి ఉందట.అందుకోసం ఇప్పుడు చిత్రయూనిట్ వేట మొదలు పెట్టారు.అయితే స్టార్ సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే చేయడానికి అందరు ఇష్టపడరు.
కానీ ఎన్.టి.ఆర్ 30 కోసం సెకండ్ హీరోయిన్ ని కూడా స్టార్ హీరోయిన్ నే తీసుకోవాలని చూస్తున్నారు. రష్మిక మందన్న, పూజా హెగ్దే చర్చల్లో ఉన్నట్టు టాక్.
అదే జరిగితే ఎన్.టి.ఆర్ తో జాన్వికి జతగా మరో హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది.