డల్లాస్ లో అమరావీరులకి నివాళులు..

అమెరికాలోని డల్లాస్ లో ప్రవాస భారతీయులు మొన్నటి ఉగ్రవాద దాడిలో అమరులు అయిన భారత జవాన్లకి శ్రద్ధాంజలి ఘటించారు.మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఇర్వింగ్ లో ఈ కార్యక్రమం జరిగింది.

 Nris Candle Light Rally In Dallas Condemning Pulvama Attack-TeluguStop.com

ఈ సంతాపానికి వందలాది మంది ప్రవాస భారతీయులు వచ్చి తమ నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మెమోరియల్ ఛైర్మన్ డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఫిబ్రవరి 14 భారత దేశ చరిత్రలో ఓ చీకటి రోజని అన్నారు.భారతీయులు మర్చిపోలేని ఘటనగా ఆ రోజుని ఎప్పుడూ గుర్తు చేసుకుంటారని అన్నారు.

ఈ చర్యలు ఓ పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.దాడిలో మరణించిన జవాన్ల కుటుంభ సభ్యులకి తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

ఈ దాడి జరిగిన వెంటనే అమెరికా కాంగ్రెస్ లో ఉన్న భారత సంతతి నేతలు, పలువురు ఈ దాడిని ఖండించారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయులు అందరూ అమరవీరుల ఆత్మకి శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం ప్రకటించారు.అనంతరం కొవ్వొత్తులతో శాంతి ర్యాలి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube