పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో భారత్- పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.ఆ యుద్ధం చరిత్రలో నిలిచిపోయిందన్న ఆయన.
ఆస్తుల కోసమో, అధికారం కోసమో జరిగిన యుద్ధం కాదని తెలిపారు.మానవత్వం కోసం పోరాడమన్నారు.
మానవత్వం కోణంలో భారత్ ఏ దేశంపై దాడులు చేయలేదని పేర్కొన్నారు.కానీ భారత్ లో శాంతికి విఘాతం కలిగించాలని చూస్తే సరైన సమాధానం ఇస్తామని శత్రు దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.
పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నప్పటికీ పీవోకేలో ఒక కుటుంబానికి కూడా ఎలాంటి నష్టం జరగనీయబోమని స్పష్టం చేశారు.