వారాహి పవన్ కళ్యాణ్ యాత్రకు తాము ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని కాకినాడ జిల్లా ఎస్ పి సతీష్ కుమార్ స్పష్టం చేశారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ పర్యటన జరిగే కాకినాడ జిల్లాకు సంబంధించి ఆయా డిఎస్పీలు, సర్కిళ్ల పరిధిలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్ పి తెలిపారు.పవన్ కళ్యాణ్ యాత్రను పోలీసులు ఆపుతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.