బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఎవరూ నమ్మరు..: మల్లు రవి

బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై కాంగ్రెస్ నేత మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రజలెవరూ నమ్మరని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లు, గ్యారంటీలను ముందు పెట్టుకొని కొన్ని సవరణలు చేసి మ్యానిఫెస్టో అంటున్నారని మల్లు రవి విమర్శించారు.ఇప్పటికే కేసీఆర్ చేతిలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని చెప్పారు.

తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు.ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవం తప్పదన్న మల్లు రవి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!
Advertisement

తాజా వార్తలు