నాని, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన అలా మొదలైంది సినిమాతో నందినీ రెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకురాలిగా పరిచయమయ్యారు.నందినీ రెడ్డి అదుర్స్ అనే టీవీ షోకు జడ్జిగా కూడా వ్యవహరించారు.
కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నందినీ రెడ్డి అలా మొదలైంది సినిమాతో సక్సెస్ సాధించడంతో ఆ సినిమా తరువాత దర్శకురాలిగా ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి.
అలా మొదలైంది సినిమా తరువాత నందినీ రెడ్డి జబర్దస్త్ అనే సినిమాకు దర్శకత్వం వహించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో పాటు హిందీ సినిమాకు రీమేక్ అని వివాదంలో చిక్కుకుంది.
ఆ సినిమా తరువాత కళ్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలకు నందినీ రెడ్డి దర్శకత్వం వహించగా ఓ బేబీ సినిమా హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.ఏక్ మినీ కథతో హిట్ సాధించిన సంతోష్ శోభన్ తో నందినీ రెడ్డి ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్టు గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
అయితే తాజాగా ఈ డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.ఆ పోస్ట్ లో లింగ భేదం, వృత్తిని బట్టి కాకుండా తనను పేరుతో పిలిస్తే సంతోషమని నందినీ రెడ్డి పేర్కొన్నారు.తనను లేడీ డైరెక్టర్ అని పిలవడం గురించి చెబుతూ నందినీ రెడ్డి అని పిలిచినా, లేడీ డైరెక్టర్ అని పిలిచినా 12 అక్షరాలే ఉంటాయని రెండింటినీ రాయడానికి ఒకే శ్రమ ఉంటుందని అయితే తాను మాత్రం నందినీ రెడ్డి అని పిలిస్తేనే సంతోషిస్తానని ఆమె అన్నారు.
అనవసరంగా జెండర్ ను బేస్ చేసుకుని లేడీ డైరెక్టర్ అని కేడీ డైరెక్టర్ అని పిలవడం ఎందుకని నందినీ రెడ్డి చెప్పుకొచ్చారు.నందినీ రెడ్డి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా చాలామంది ఆమె పోస్ట్ కు మద్దతు ఇస్తుండటం గమనార్హం.
.